బీజేపీ దుష్ప్రచారంపై కిన్నెర మొగులయ్య ఆగ్రహం..నా నోట్లో మన్నుకొట్టారు !

-

బీజేపీ దుష్ప్రచారం పై ప్రముఖ గాయకుడు కిన్నెర మొగులయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే, నాకు నా కళ కు గుర్తింపు వచ్చిందని బీజేపీ పార్టీకి చురకలు అంటించారు. బీజేపీ వారు నాతో మాట్లాడిన వీడియో లతో దుష్ప్రచారం చేసి నా నోట్లో మన్ను పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పద్మ శ్రీ మేమిచ్చామని బీజేపీ వారు చెప్పుకుంటున్నారని ఓ రేంజ్ లో ఫైర్‌ అయ్యారు. అవసరమైతే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తానని.. స్పష్టం చేశారు పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత కిన్నెర మొగులయ్య.

కాగా.. ఇటీవలే.. భారతీయ జనతా పార్టీ.. మొగిలయ్య మాట్లాడిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో.. మొగిలయ్య.. బండి సంజయ్‌ మరియు బీజేపీ పార్టీని మెచ్చుకున్నట్లు ఉంది. అలాగే.. టీఆర్‌ఎస్‌ పార్టీని మొగిలయ్య తిట్టినట్లు క్రియేట్‌ చేశారు బీజేపీ ఐటీ శ్రేణులు. అయితే.. దీనిపై స్వయంగా మొగిలయ్య.. క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news