బుల్లెట్ వేసుకొని కెసిఆర్ బెడ్ రూమ్ వరకు ఓవైసీ వెళ్తాడు – కిషన్ రెడ్డి

-

 

బుల్లెట్ బండి వేసుకొని కెసిఆర్ బెడ్ రూమ్ వరకు అసదుద్దీన్ ఓవైసీ వెళ్తాడని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ సభకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించలేదు… మా బ్యానర్ లు తీసేశారని ఫైర్ అయ్యారు. మీ నుండి నేర్చుకోవాల్సింది… బాప్ బెట పాలన, నియంతృత్వ పాలన నేర్చుకోవాలా ? అని నిలదీశారు కిషన్ రెడ్డి.

కెసిఆర్, mim కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటుంది…8 సంవత్సరాల నుండి సెక్రటేరియట్ కు రాలేదు… నెలకు 20 రోజులు ఫార్మ్ హౌస్ లో ఉంటాడని చురకలు అంటించారు. డైనింగ్ టేబుల్ మీద జరిగే మీటింగ్ తెలంగాణ కేబినెట్ మీటింగ్ అంటూ విమర్శలు చేశారు కిషన్ రెడ్డి. అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ వేసుకొని నేరుగా సీఎం బెడ్ రూం వరకు వెళతాడు…ప్రధాని కు వ్యతిరేకంగా కెసిఆర్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news