ఆ పనికి మాలిన ఎమ్మెల్యేలకు రూ.400 కోట్లు పెట్టడం…వృధానే ? – కిషన్ రెడ్డి

-

ఆ పనికి మాలిన ఎమ్మెల్యేలకు రూ.400 కోట్లు ఇస్తే…వృధానే ? అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆ నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రజా బలం అస్సలు లేదని.. వారిని మేమేందుకు కొంటామని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు trs చేసిన పెద్ద కుట్ర అని.. ఓటమి కళ్ళ ముందు కన్పించడం తో కొత్త ఆటకు తెర లేపారని ఆగ్రహించారు.

పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ లో trs ఎమ్మెల్యేలను బిజెపి లో చేర్పించేందుకు వందల కోట్లు వారికి ఇవ్వడం కోసం బిజెపి కుట్ర, నేరం చేసిందని రాత్రికి రాత్రి ప్రధాని దిష్టిబొమ్మల ను మంత్రులు మునుగోడు లో తగల బెట్టారని ఆగ్రహించారు. డబ్బు, కాంట్రాక్ట్, పదవులు ఆశ పెట్టారని రాత్రికి రాత్రి పెద్ద డ్రామా అని నిప్పులు చెరిగారు. వినాశ కాలే విపరీత బుద్ది… TRS పార్టీ గురువిండ సామెత ల వ్యవహరిస్తుందన్నారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటేడ్ అని.. మునుగోడు ప్రజలు తమ వైపు లేరని వింత నాటకాలకు, కొత్త డ్రామాకు తెర లేపారని ఆగ్రహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news