కివీస్ VS ఇండియా టెస్టు సిరీస్.. మ్యాచ్‌కు విలియమ్సన్ దూరం!

-

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం భారత్ స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది.అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్ ఆడనుంది.దీనికి బెంగళూరు వేదిక కానుంది.వరల్డ్ టెస్టు ఛాంపియన్‌‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్‌-న్యూజిలాండ్‌లకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. కాగా, సిరీస్ ప్రారంభానికి ముందే కివీస్‌కు భారీ షాక్ తగిలింది.ఆ జట్టు క్రికెటర్ కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశాలున్నాయి.

మిగిలిన 2 టెస్టుల్లోనూ విలియమ్సన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.గజ్జల్లో నొప్పి కారణంగా అతను సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.’ఇటీవల శ్రీలంకతో జరిగిన 2వ టెస్టులో విలియమ్సన్ గజ్జల్లో అసౌకార్యానికి గురయ్యాడు. భారత్‌లో జట్టుతో అతను చేరడానికి ముందు పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పట్టేలా ఉంది.విలియమ్సన్ గాయం తీవ్రతరం చేయడం కంటే విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమంగా భావిస్తున్నాం అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version