షర్మిల పోటీ అక్కడ నుంచి కాదు.. అవన్నీ పుకార్లే ?

-

పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆమె అనుచరులు కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ముందు పార్టీ నిర్మాణం మీద మా దృష్టి ఉంటుందని పేర్కొన్న ఆయన ఏప్రిల్ 8 వరకు ఖమ్మం సభకే  ఇప్పుడు మా ప్రాధాన్యత అని అన్నారు. ఖమ్మం లో నిర్వహించే సభ కోసమే కోఆర్డినేటర్ ను పెట్టారు అని పార్టీ ప్రకటించకుండానే ఎన్నికలలో పోటీ పై ఆలోచన ఎందుకుంటుంది ? అని ప్రశ్నించారు.

అయితే ఈరోజు తాను పోటీ చేసేది పాలేరు నుండే అంటూ షర్మిల వ్యాఖ్యానించారు అని దాదాపు అన్ని మీడియా చానల్స్ లో స్క్రోలింగ్స్ వచ్చాయి. దీంతో అంతా నిజమేనని అనుకున్నారు. ఇప్పుడు ఈయన అదేమీ లేదని పేర్కొన్నారు. అయితే షర్మిల నేరుగా ప్రకటన చేస్తే కానీ ఈ కన్ఫ్యూజన్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. చూడాలి ఏమి జరగనుంది అనేది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version