బీజేపీని చూస్తే సీఎం కేసీఆర్ కు నిద్రపడ్తలేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని చూస్తే సీఎం కేసీఆర్ కు నిద్రపడ్తలేదని.. మునుగోడులో ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ది పనులు చేపడుతోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

శివన్నగూడెంలో రైతులను ముంచి వారి భూములను గుంజుకుని ఆర్ ఆర్ ప్యాకేజీకి కింద నష్టపరిహారం ఇవ్వలేదన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ముంపు గ్రామాల్లోని వారికి పరిహారం, రోడ్లు వేయడం, పెన్షన్ లు ఇస్తున్నారని విమర్శించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజీనామా చేసింది మునుగోడు ప్రజలకే అని అందరికీ అర్థమైందన్నారు. పాఠశాలలో పాఠ్యపుస్తకాలు ఇంకా రాకపోవడం శోచనీయమన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని విమర్శించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాళేశ్వరం కుంభకోణంలో డబ్బులు గుమ్మరించి.. ఖజానా ఖాళీ చేశాడన్నారు. మద్దతు ధర ఇచ్చేది కేంద్రమేనని ఇప్పుడు రైతులు అర్థం చేసుకున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతుల బావుల  దగ్గర మీటర్లు పెడుతారనంటూ విషపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news