హైదరాబాద్ లోనే కరెంట్ లేదు… కేటీఆర్ ఏపీ వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తా… మంత్రి బొత్స కౌంటర్

-

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల ఫైర్ అవుతున్నారు. తాజాగా కేటీఆర్ ఓ కార్యక్రమంలో ఏపీలో రోడ్లు బాగా లేవని, కరెంట్ ఉండటం లేదు, నీళ్లు లేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఫ్రెండ్ కేటీఆర్ కు ఫోన్ చేసి చెప్పారని.. కానీ నేను హైదరాబాద్ లో ఉండి వచ్చానని.. కరెంట్ లేక జనరేటర్ వాడాల్సి వచ్చిందని బొత్స అన్నాడు. కేటీఆర్ ఏపీకి వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తా అని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో కరెంట్ లేదని నేను ఏం వ్యాఖ్యలు చేయలేదని… వాళ్ల ఘనత చెప్పుకోవడానికి ఇతరులను తక్కవ చేసి మాట్లాడవద్దని హితవు పలికారు. బాధ్యయుతమైన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని.. ఈ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు బొత్స అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news