కేటీఆర్, సబిత రాజీనామా చేయాలి – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ పాలనలో అన్ని లీకులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఏప్రిల్ 8న హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన ఉన్న సందర్భంగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్ లను బిజెపి నేతలతో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఎస్పిఎస్సి, టెన్త్ పేపర్ లీకులపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకుల జాతర నడుస్తుందని విమర్శించారు. వరుస లీకులకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. లీకులకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news