ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్..రోజుకు రూ.45 ఆదా చేస్తే రూ.36 లక్షలు మీ సొంతం..

-

భారత దేశంలోని అతి పెద్ద భీమా కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఎల్ఐసీ పథకాల పట్ల ప్రజల్లో నమ్మకం ఇప్పటికీ స్థిరంగా ఉంది. పోస్టాఫీసు తరహాలోనే ఎల్ఐసీ అనేది తరతరాల విశ్వాసంగా మిగిలిపోయింది.తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలను అందిస్తుంది.కాగా, తాజాగా మరో స్కీమ్ ను అందిస్తుంది.జీవన్ ఉమంగ్ పాలసీ ఒక ఎండోమెంట్ ప్లాన్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు.

ఈ పాలసీని తీసుకోనేవారికి 100 సంవత్సరాల జీవిత బీమా రక్షణ లభిస్తుంది. 90 రోజుల నుండి 55 సంవత్సరాల వయస్సు గల వారు ఈ ప్లాన్‌ లో చేరవచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత, పాలసీదారు ఖాతాలో ప్రతి సంవత్సరం నిర్ణీత మొత్తంలో డబ్బు వస్తూనే ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే, అతని నామినీకి మొత్తం ఒకేసారి చెల్లించబడుతుంది..జీవన్ ఉమంగ్ పాలసీలో పెట్టుబడి పెట్టే వారికి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకోవాలంటే కనీసం రెండు లక్షల రూపాయల బీమా తీసుకోవాలి..

ఒక వ్యక్తి 26 ఏళ్ల వయస్సులో జీవన్ ఉమంగ్ పాలసీని కొనుగోలు చేసి, రూ. 4.5 లక్షల బీమా రక్షణ కోసం 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి, అంటే మీరు నెలకు రూ.1350 చెల్లించాలి. ఈ విధంగా, మీరు ఈ పథకం పెట్టుబడి కోసం ప్రతిరోజూ 45 రూపాయలు ఆదా చేయాలి..ప్రీమియం ఒక సంవత్సరంలో రూ. 15882 మరియు 30 సంవత్సరాలలో మీ ప్రీమియం చెల్లింపు రూ. 4,76,460 అవుతుంది. ఈ విధంగా, LIC 31వ సంవత్సరం నుండి మీ పెట్టుబడిపై ప్రతి సంవత్సరం 36 వేల రూపాయలను డిపాజిట్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా 31వ సంవత్సరం నుంచి 100 ఏళ్ల వరకు ప్రతి సంవత్సరం రూ.36,000 రిటర్న్ లభిస్తుంది..2 సంవత్సరాలు పూర్తి ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే పాలసీదారు రుణం పొందేందుకు అర్హుడు. అయితే ప్రీమియం చెల్లింపు వ్యవధిలో రుణం పొందినట్లయితే, సరెండర్ విలువ శాతం రూపంలో అమలులో ఉన్న పాలసీలకు గరిష్ట రుణం 90 శాతం వరకూ .ఈ పథకం లో ఎటు చూసినా లాభాలే…

Read more RELATED
Recommended to you

Latest news