నామినేషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

-

ఓవైపు లోక్ సభ తొలి విడత ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మిగతా ప్రాంతాల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ రాష్ట్రాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. తెలంగాణలో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ జోరందుకుంది.

ఇక తాజాగా గుజరాత్ లోనూ ఈ ప్రక్రియ ఊపందుకుంది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నామినేషన్ వేశారు. గుజరాత్ లోని గాంధీనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన అదే స్థానానికి ఈరోజు ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం పటేల్ తో కలిసి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. మరోవైపు గాంధీనగర్‌ నుంచి అమిత్ షాకు వ్యతిరేకంగా  కాంగ్రెస్‌ పార్టీ తరఫున సోనాల్‌ పటేల్‌ బరిలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version