వైఎస్‌ వివేక హత్య…ఓ “జగనాసుర రక్త చరిత్ర” : లోకేష్‌ సంచలన పోస్టు !

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సీబీఐ అధికారులు చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. సీబీఐకి సునీత రెడ్డి గతంలో ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు ఇప్పుడు బయట పడ్డాయి. తమ నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసని… నాన్న హత్య పై భారతి, జగన్ చాలా తేలిగ్గా స్పందించారని వాంగ్మూలంలో సునీతా రెడ్డి పేర్కొన్నారు.

అవినాష్‌ రెడ్డినే అసలు ముద్దాయి అంటూ ఆరోపణలు చేశారు సునీత రెడ్డి. దీంతో ఈ వివాదాన్ని టీడీపీ బాగా క్యాష్‌ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే టీడీపీ యంగ్‌ లీడర్‌ నారా లోకేష్‌ తన ట్విట్టర్‌ వేదికగా ఓ సంచలన పోస్టు చేసాడు. సీఎం జగన్‌ గంగలో మునిగిన ఫోటో పెట్టి…పాపాలు అన్ని పోయాయంటూ పోస్టు పెట్టాడు. “11 కేసులకు మరొకటి తోడైంది. జగనాసుర రక్త చరిత్ర బయటపెట్టిన చెల్లెమ్మ.” అంటూ ఈ పోస్టర్‌ కు ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చాడు నారా లోకేష్‌. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news