లోకేష్ మాటలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి – ఎంపీ భరత్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. నారా లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న సీఎం జగన్ ని నారా లోకేష్ దొంగ అంటూ సంభోదించారని.. జగన్ పేరు సాక్షాత్తు విష్ణు స్వరూపం అన్నారు ఎంపీ భరత్. లోకేష్ మాటలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. చంద్రబాబు, లోకేష్ వై నాట్ పులివెందుల అనడం అస్యాస్పదంగా ఉందన్నారు.

ఈసారి పులివెందుల నుంచి సీఎం జగన్ కు మెజారిటీ లక్ష ఓట్లకు తక్కువగా రాదని ధీమా వ్యక్తం చేశారు. అసలు టిడిపి వై నాట్ 175 సింగిల్ గా పోటీ చేయగలదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు అనే పదం ప్రజల నుంచి వినిపిస్తుందని ఎద్దేవా చేశారు ఎంపీ భరత్. రాజమండ్రిలో అభివృద్ధిపై సెల్ఫీ ఛాలెంజ్ కి తాను సిద్ధం అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news