మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు : హరీశ్‌ రావు

-

బీజేపీ నేతలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే.. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజల పేరుతో బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నిజానికి వీటిని ప్రోత్సహించేది బీజేపీయేనని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్యంలో సర్టిఫికెట్ కోర్సును ప్రవేశ పెట్టినది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు మంత్రి హరీశ్ రావు. టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ వెళ్లి.. ఆ భూత వైద్యం కోర్సులో చేరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు.

మునుగోడు ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. ఓట్ల కోసం డబ్బులు పంచడమేగాకుండా 2 వేల కార్లు, 2 వేల బైకులు కొనిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులను సైతం ప్రలోభ పెడుతున్నారన్నారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.. బైకులు, కార్లు ఎక్కడి నుంచి తెస్తున్నారో ఆరా తీస్తున్నామని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు మంత్రి హరీశ్ రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version