Breaking : ముగిసిన కేటీఆర్‌ దావోస్‌ పర్యటన.. తెలంగాణకు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు

-

స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొనడం తెలిసిందే. గత కొన్నిరోజులుగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలతో కేటీఆర్ బిజీగా గడిపారు. పలు పరిశ్రమలను తెలంగాణకు వచ్చేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. తాజాగా, దావోస్ లో కేటీఆర్ పర్యటన దిగ్విజయంగా ముగిసిందని ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపింది. దావోస్ లో నాలుగు రోజుల పర్యటనలో కేటీఆర్ 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు నిర్వహించినట్టు వివరించింది. సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో మ‌రో 3 డాటా సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు దావోస్ వేదిక‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్లోబ‌ల్ మ‌ల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్‌స్పైర్ బ్రాండ్స్ హైద‌రాబాద్‌లో త‌మ స‌పోర్ట్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విష‌యం విదిత‌మే.

Read more RELATED
Recommended to you

Latest news