రాహుల్‌కు పబ్‌లు తెలుసు.. వడ్ల గురించి ఏం తెలుసు : కేటీఆర్‌

-

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విపక్షాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో పాటు ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీలపై విమర్శనాస్రాలు సంధించారు మంత్రి కేటీఆర్‌. ఆయన తాజాగా మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రాహుల్ గాంధీ అడుగుతున్నారని… 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ కు పబ్ ల గురించి తెలుసని, వడ్ల గురించి ఏం తెలుసని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

KTR taking over as Telangana CM imminent? Support grows | The News Minute

ఇక మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప బండి సంజయ్ చేసేది ఏముందని మండిపడ్డారు. జన్ ధన్ ఖాతాల్లో నగదు వేస్తామన్నారని… ఇప్పటి వరకు వేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేముందని అడిగారు. మసీదులు తవ్వాలని బండి సంజయ్ అంటాడని… ఆయనకు సిగ్గూశరం ఉందా? అని ప్రశ్నించారు. ఆయన చాలా విచిత్రమైన వ్యక్తి అంటూ మంత్రి కేటీఆర్‌ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news