భార‌త్ జోడో కాదు కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలి : మంత్రి కేటీఆర్‌

-

మరోసారి కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాల‌ని సూచించారు. ఇవాళ దేశంలో రాజ‌కీయ శూన్య‌త ఏర్ప‌డింద‌న్నారు మంత్రి కేటీఆర్‌. ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా విఫ‌ల‌మైంద‌న్నారు మంత్రి కేటీఆర్‌.

Demand to make KTR Minister gets shriller

రాహుల్ పాద‌యాత్ర చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన గోవా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరార‌ని గుర్తు చేశారు. తెలంగాణ‌లో ఎన్ని రోజులైనా యాత్ర చేసుకోవ‌చ్చు.. దాని వ‌ల్ల తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు రాహుల్‌కు తెలుస్తాయ‌న్నారు మంత్రి కేటీఆర్‌. రాహుల్ తెలంగాణ‌లో పాద‌యాత్ర చేసే స‌మ‌యంలో ఆ పార్టీ ఎంపీలు కాంగ్రెస్‌ను వీడనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయ‌ని తెలిపారు మంత్రి కేటీఆర్‌. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news