కళ్ల జోడు పెట్టుకొని ఫోటో.. ఆసక్తికర ట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌

-

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే తన గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు.
కార్యాలయంలో కళ్ల జోడు పెట్టుకొని కంప్యూటర్ స్ర్కీన్ చూస్తున్న ఫొటో షేర్ చేశారు. కళ్ల జోడు పెట్టుకునేందుకు మొన్నటిదాకా
ఇష్టపడలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు అవి లేకుండా చదవలేకపోతున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ లెక్కన తన వయసైపోయిందని అధికారికంగా చెప్పొచ్చు అని చమత్కరించారు మంత్రి కేటీఆర్.

ఈ ట్వీట్, ఫొటో చూస్తుంటే ఆయనకు సైట్ వచ్చినట్టు అర్థం అవుతోంది. మంత్రి కేటీఆర్ ఇప్పటిదాకా కళ్ల జోడు ధరించి బయట కనిపించింది లేదు. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు. ఇప్పుడు కళ్ల జోడును తన ఆఫీస్ వరకే పరిమితం చేస్తారో? లేదంటే బయట కూడా పెట్టుకొని కనిపిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version