తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ కి ఎందుకు అప్ప్లై చేశారు: మంత్రి రోజా

-

కాసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మీడియాతో మళ్లాడుతూ చంద్రబాబు కేసు మరియు లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయాల గురించి మరోసారి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఈ చట్టం ముందు తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు అంటూ వీరిద్దరినీ ఉద్దేశించి కామెంట్స్ చేసింది రోజా. ఒకవేళ లోకేష్ కనుక తప్పు చేయకపోతే ఎందుకు ముందస్తు బెయిల్ కోసం అప్ప్లై చేశారు అంటూ విమర్శించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగలం పాదయాత్రను కూడా మధ్యలోనే ఆపేసి ఎందుకు ఢిల్లీ కి వెళ్లి దాక్కున్నారు అంటూ రోజా తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తింది. ఇక ఇదే సమయంలో భువనేశ్వరి మరియు బ్రాహ్మణి లను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు ఎంతో కొంత ఎన్టీఆర్ కూతురు మానవరాళ్లుగా సమాజంలో మంచి పేరుంది.. చంద్రబాబు రాసిచ్చిన అబద్దపు స్క్రిప్ట్ లను వీధుల్లోకి వచ్చి చదివి ఎందుకు పరువు పోగొట్టుకుంటారు అంటూ సలహా ఇచ్చింది మంత్రి రోజా.

ఇక చంద్రబాబు నాయుడు బయటకు ఇప్పుడల్లా రావడం కుదరదని కేసులన్నీ తనకు స్ట్రాంగ్ గా మారుతున్నాయని రోజా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version