మిలియన్ మార్చ్ మోడీ దగ్గర చేయి..బండి సంజయ్ పై మంత్రి వేముల ఫైర్

-

మిలియన్ మార్చ్ మోడీ దగ్గర చేయి అంటూ బండి సంజయ్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ఉద్యోగకల్పన పై శ్వేతపత్రం విడుదల చేయాలని.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఇచ్చినన్ని ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. నా రాజీనామా సవాల్ కు కట్టుబడి ఉన్న బండి సంజయ్…నిరూపిస్తవా.. నీవు సిద్ధమా? అని ప్రశ్నించారు. అర్వింద్ పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేసాడు…అందుకే రైతులు తిరగబడుతున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీ వల్ల రాష్ట్రానికి ఏ ఒక్క రూపాయి అదనంగా రాలేదని.. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ పాలిట శత్రువేనని మండిపడ్డారు. పెద్దమనిషి కేసీఆర్ ను ఆయన పిల్లలు కెటిఆర్,కవితలను తిడుతూ రాజకీయపబ్బం గడుపుతున్నారని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే టిఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊర్కోరని అగ్రహించారు. బాల్కొండ అభివృద్ధి పై విమర్శించేవారంతా రాజకీయంగా అడ్రస్ లేనివారేనని తెలిపారు. మీరు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసిన బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ఆగదని పేర్కొన్నారు మంత్రి వేముల.

Read more RELATED
Recommended to you

Latest news