తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీల్లో స్వల్ప మార్పు

-

తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ గడువును పెంచింది సాంకేతిక విద్యాశాఖ. మంగళవారం ఎంసెట్ కౌన్సిలింగ్ ముగియాల్సి ఉండగా.. ఇంటర్ సెకండియర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో తాజాగా ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాంకేతిక విద్య కమిషన్ నవీన్ మిట్టల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వాస్తవానికి తొలి విడత ఎంసెట్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ కడుగు సోమవారం, ధ్రువపత్రాల పరిశీలన గడువు మంగళవారం ముగిసింది. అయితే తాజాగా మంగళవారమే ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులు ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లకు కొత్త తేదీలను ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version