జయశంకర్ సార్ స్వగ్రామానికి వచ్చి రేవంత్ రెడ్డి లుచ్చా మాటలు మాట్లాడాడు: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

-

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. హనుమకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ లా ప్రవర్తించాడు అన్నారు. జయశంకర్ సార్ స్వగ్రామానికి వచ్చి లుచ్చా మాటలు మాట్లాడాడు అంటూ ఫైర్ అయ్యారు ధర్మారెడ్డి. రైతు డిక్లరేషన్ ను ఆరేళ్ళ క్రితమే కెసిఆర్ తీసుకొచ్చాడు అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దండగన్న వ్యవసాయాన్ని పండగలా చేశామని అన్నారు. ఐదు లక్షల రైతు బీమా పథకాన్ని పది రోజుల్లోనే అందిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పాలిత చత్తీస్ఘడ్ రైతులు తెలంగాణకు ఎందుకు వస్తున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు అక్కంపేట రచ్చబండలో రైతులే లేరని విమర్శించారు. పరకాల లో ఏ గ్రామానికి వచ్చిన రేవంత్ కు చెప్పుదెబ్బలు తప్పవు అంటూ హెచ్చరించారు. రేవంత్ కు జయశంకర్ సార్ గురించి, రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కొడంగల్ కి వస్తా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని సవాల్ విసిరారు చల్లా ధర్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version