తెలంగాణలోకి రాహుల్‌ యాత్ర.. ప్రత్యేకంగా స్వాగతం పలికిన ఎమ్మెల్యే సీతక్క

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఆదివారం సాయంత్రం తెలంగాణలో అడుగుపెట్టనున్నారు రాహుల్‌ గాంధీ. తెలంగాణలో రాహుల్ యాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం చెప్పేందుకు టీపీసీసీ భారీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర ఆదివారం సాయంత్రానికి తెలంగాణకు చేరనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు రాహుల్ యాత్రకు స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ములుగు ఎమ్మెల్యే ధనసిరి అనసూయ అలియాస్ సీతక్క… రాహుల్ యాత్రకు స్వాగతం చెబుతూ శనివారం రాత్రి ఓ ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు.

Telangana MLA Seethakka hits out at IPS officer for stopping her mother's  blood donors | The News Minute

ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అన్న వాక్యాలతో మొదలైన సీతక్క వీడియో రాహుల్ గాంధీని శక్తివంతమైన నేతగా అభివర్ణించింది. చెడుపై యుద్ధానికి కాలమెప్పుడూ ఓ వీరుడిని సృష్టిస్తుంది.. అడుగులో అడుగేస్తూ అతడు కడలిలా కదిలొస్తాడు.. అంటూ రాహుల్ యాత్ర సాగిన రాష్ట్రాలను ప్రస్తావిస్తూ ఆ వీడియో సాగింది. వెల్ కమ్ రాహుల్ అన్నా అంటూ తన వీడియోకు ఓ కామెంట్ ను జత చేసిన సీతక్క ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news