రాజగోపాల్ రెడ్డి అహంకారంతోనే ఉప ఎన్నిక వచ్చింది : జీవన్‌ రెడ్డి

-

తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో హామీలు, విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. తాజాగా కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డి అహంకారంతోనే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు జీవన్‌రెడ్డి. శివన్నగూడెం రైతుల కోసం కోమటిరెడ్డి ఏనాడైనా ధర్నా చేశారా? అని ప్రశ్నించారు జీవన్‌రెడ్డి. ఇప్పుడు ఉప ఎన్నికలో గెలిచినా ఎమ్మెల్యేనే అవుతారని… ఆయన సాధించేది ఏముందని అన్నారు.

Congress party MLC T Jeevan Reddy demands govt to take back field assistants

ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పాల్పడుతుందని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో ఓటుకు రూ. 10 వేలు ఇవ్వడానికి సిద్ధమయ్యాయని అన్నారు జీవన్‌రెడ్డి. మరోవైపు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి టీఆర్ఎస్ కు ఓటు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఛైర్మన్ పదవికి గుత్తా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జీవన్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news