ఆ పథకంపై పేదలు ఆశలు వదులుకోవాల్సిందే : ఎంపీ అర్వింద్

-

డబుల్​ బెడ్​రూమ్ ఇళ్లపై పేదలు ఆశ వదులుకోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రెండు పడక గదుల విషయంలో కేసీఆర్​ మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5-6 లక్షలు ఇస్తానని ప్రకటించి.. ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు. నిజమాబాద్​ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. డబుల్​ బెడ్​ రూమ్ పథకం కోసం బడ్జెట్​లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు.

2020-21లో రూ.10 వేల కోట్లు బడ్జెట్​లో పెట్టి ఇళ్లపై రూపాయి ఖర్చు చెయ్యలేదని ఆరోపించిన ఆయన.. నిధులు ఎక్కడికి వెళ్లిపోయాయని ప్రశ్నించారు. 2021-2022లో రూ.10,875 కోట్లు కేటయించామని చెప్పి చివరకు రూ.4800 కోట్లకు కుదించి రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదని మండిపడ్డారు.

అసలు ప్రభుత్వం డబ్బులే కేటాయించనప్పుడు ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. దీనిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా పేదలు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లపై ఆశలు వదులుకోవాలని అర్వింద్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version