మోడీ పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోంది : ఎంపీ ఆర్వింద్‌

-

మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌. తాజాగా ఎంపీ అర్వింద్‌
మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని అన్నారు. ప్రధాని మోడీకి కనపడకుండా తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్ మరోసారి కావాలనే ఢిల్లీకి వెళ్తున్నట్లు ఉందన్నారు ఎంపీ అర్వింద్‌. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి టీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందని ఎంపీ అర్వింద్‌ చెప్పారు. మునుగోడులో నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు ఎంపీ అర్వింద్‌. మునుగోడు ఉప ఎన్నికతో దక్షిణ తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి మంచి అవకాశం దొరికిందని ఎంపీ అర్వింద్‌ చెప్పారు.

మునుగోడులో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేసి టీఆర్ఎస్ గెలిచిందన్నారు ఎంపీ అర్వింద్‌. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లాను పట్టించుకోకుండా అక్కడే తిష్టవేశారని మండిపడ్డారు ఎంపీ అర్వింద్‌. నిజామాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఎంపీ అర్వింద్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version