కార్యకర్తల్లో జోష్‌ ఉంది.. సమస్యలపై పోరాడుతున్నారు : నాగబాబు

-

నేడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణెదల నాగబాబు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. జనసేనా ఫ్యామిలీ చూడడానికి… వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అవగాహన పెంచుకునేందుకు వచ్చానని వ్యాఖ్యానించారు నాగబాబు. హైదరాబాదులో కూర్చొని ఎవ్వరో చెప్పింది తెలుసుకునే కంటె నేరుగా వచ్చి తెలుసుకోవాలనుకున్నానని వివరించారు నాగబాబు.

Janasena party needs to come to power in the state - Nagababu

అంతేకాకుండా ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చిందని నాగబాబు అన్నారు. కార్యకర్తలలో మంచి జోష్‌ ఉందని, నియోజకవర్గం సమస్యల చాలా లేవనెత్తారని నాగబాబు అన్నారు. నాయకులలో చిన్నచిన్న విభేదాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా ఖనిజ సంపద ఉంది… చాలా మంది దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మరీ ఎక్కువ ఖనిజ సంపదుందని, ప్రజల కోసం ప్రస్తుత నాయకులు పనిచేయడం లేదని, ఖనిజ సంపద కోసమే పని చేస్తున్నారని నాగబాబు ధ్వజమెత్తారు. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో వలసలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news