BJP: బీజేపీ నేతల కీలక భేటీ.. జాతీయ కార్యవర్గ సమావేశాలపై చర్చ

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సిద్ధం అవుతోంది. హైదరాబాద్ వేదికగా జూలై 2,3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్నాయి. దీనికి రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలకు సంబంధించి అధిష్టానం నుంచి కీలక సూచనలు అందాయి. వచ్చే ఎన్నికలను ప్రతిబింబించేలా జనసమీకరణ ఉండాలని ఆదేశాలు అందాయి. దీంతో పాటు మోదీ విడిది నుంచి కార్యక్రమం జరిగే వేదిక దాకా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. 

తాజాగా జాతీయ కార్యవర్గ ఏర్పాట్లపై చర్చించేందుకు బీజేపీ నేతలు భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్ ఇతర నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధాని మోదీతో సహా, అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news