INDIA స్థానంలో BHARAT అని పెట్టిన అసోం సీఎం

-

గత రెండు రోజులుగా బెంగుళూరు లో జరిగిన INDIA కూటమి పార్టీల మీటింగ్ ముగిసింది. ఇందులో కీలకమైం అంశాలపై ముఖ్య నేతలు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా విపక్షాల కూటమికి INDIA పేరు పెట్టారు.

అయితే.. ఈ నేపథ్యంలోనే.. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తన ట్విటర్ బయోలో INDIA అని తొలగించి, BHARAT అని యాడ్ చేశారు. ప్రతిపక్ష కూటమి INDIA అని పేరు పెట్టిన తర్వాత శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘బ్రిటీషర్లు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. బ్రిటిష్ వారసత్వం నుంచి విముక్తి పొందాలి. పూర్వీకులు భారత్ కోసం పని చేశారు. మనం కూడా భారత్ కోసం వర్క్ చేయాలి’ అని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version