కాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు… ఇద్దరు ఉగ్రవాదుల హతం

-

జమ్మూ కాశ్మీర్ లో రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లు జరిగాయి. దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్, కుల్గాం జిల్లాలో ఈ రెండు ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపడుతున్న సమయంలో ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కుల్గాం జిల్లా డిహెచ్ పోరా ప్రాంతంలోని చకి సమద్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నిషేధిత లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిని హతమార్చినట్లు కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరణించిన ఉగ్రవాదిని స్థానికుడిగా గుర్తించారు. 

మరో ఎన్ కౌంటర్ అనంత్ నాగ్ జిల్లాలోని సిర్హామా ప్రాంతంలో జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. లష్కర్ ఏ తోయిబా కమాండర్ నిసార్ దార్ ను హతమార్చారు. పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ముందు జాగ్రత్తగా అనంత్ నాగ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news