World Cup 2023 : క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త

-

World Cup 2023 : క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫైనల్, మ్యాచ్ లకు రిజర్వ్డ్ కేటాయించినట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచులు జరగకపోతే మరుసటి రోజు రిజర్వ్డ్ డే ఉండనుందని పేర్కొంది. కాగా, తొలి సెమీఫైనల్ రేపు ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది.

ICC good news for cricket fans

ఈ నెల 17న జరిగే రెండో సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా జట్టు తలపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 19న జరగనుంది. కాగా, వన్డే వరల్డ్ కప్ లో అజయంగా దూసుకెళ్తున్న భారతజట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది. లీగ్ దశలో 9కి 9 మ్యాచులు గెలిచిన రోహిత్ సేన రేపు న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ బెర్తుపై కన్నేసిన టీమిండియా ముంబైలోని వాంకడే స్టేడియంలో నవంబర్ 15 బుధవారం మధ్యాహ్నం జరిగే తొలి సెమీఫైనల్లో కివీస్ ను మరోసారి ఓడించాలనే పట్టుదలతో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version