WORLD CUP 2023 : ఆస్పత్రిలో చేరిన గిల్.. విషమంగా ఆరోగ్యం!

-

ఇండియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్ ఆస్పత్రి పాలయ్యాడు. గత కొన్ని రోజులుగా డెంగ్యూ బారిన పడి.. చికిత్స తీసుకుంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్.. ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ ప్రకటించింది. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్ చికిత్స తీసుకుంటున్నాడని పేర్కొంది.

Shubman Gill hospitalised in Chennai after the platelet count dropped a bit

లేట్ లెట్స్ తక్కువగా ఉండటంతో గిల్ టీమిండియాతో కలిసి ఢిల్లీకి వెళ్లలేదని పేర్కొంది. ఇక రేపు జరిగే ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మ్యాచ్కు దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్… ఆరోగ్యం కుదుటపడితే నేరుగా అహ్మదాబాద్ వెళ్లే ఛాన్స్ ఉందని వివరించింది. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ లోపు టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్ కోలుకుంటే… జట్టులో చేరుతాడు. లేకపోతే చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version