ఎంపీ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం పై లోక్ సభలో దుమారం

-

లోక్ సభలో నిన్న కొంత మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.  ఇవాళ కొంత మంది ప్రమాణ స్వీకారం స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మల్లు రవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘువీర్ రెడ్డిలతో పాటు  హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు.

అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారంపై లోక్ సభలో పెద్ద దుమారమే రేగింది. ప్రమాణ స్వీకారం తరువాత చివరల్లో జై భీమ్, జైభీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో నాగర్ కర్నూలు ఎంపీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఎంపీలు అందరూ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం పై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు. అనంతరం ఎంపీ మల్లు రవి ప్రమాణం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version