Breaking : ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కు అస్వస్థత

-

ఎన్‌సీపీ అధినేత శరద్​ పవార్​ అనారోగ్యానికి గురయ్యారు. మూడ్రోజుల పాటు ఆయన ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రోజుల్లో ఆయన పాల్గొనబోయే పార్టీ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

మూడు రోజుల చికిత్స అనంతరం నవంబర్ 3న ఆస్పత్రి నుంచి శరద్​ పవార్​ తన ఇంటికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగబోయే ఎన్​సీపీ క్యాంపునకు ఆయన హాజరవుతారని తెలిపాయి.

గత ఏడాది ఏప్రిల్‌లో శరద్ పవార్ పిత్తాశయ సమస్య కారణంగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయనకు మూడు సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఎందుకు ఆసుపత్రిలో చేరారు అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version