ప్రజలే టీఆర్ఎస్ బలం..మునుగోడులో విజయం ఖాయం – నిరంజన్ రెడ్డి

-

ప్రజలే టీఆర్ఎస్ బలం..మునుగోడులో విజయం ఖాయమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ మునుగోడులో ఎన్నికల ప్రచారంలో నిరంజన్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని.. బుక్కెడు బువ్వ పెడితే తిన్నం, జై తెలంగాణ అని ఉద్యమించినం.. తెలంగాణ రాష్ట్రం సాధించామన్నారు.

మునుగోడుకు నీళ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శివన్నగూడెం నిర్మిస్తున్నారని.. 60 ఏండ్లు మిగతా పార్టీలు ఏం చేశాయి ? నల్లగొండ బిడ్డలకు ఫ్లోరైడ్ విషపు నీళ్లు తాగించారని తెలిపారు. ఇక్కడి ప్రజల విషాద జీవనం నాకు తెలుసని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరధతో విషపు నీళ్లకు విరుగుడు ఇచ్చారని ఫైర్‌ అయ్యారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిషన్ భగీరధకు ఒక్క రూపాయి సాయం చేయలేదని.. ఏ మొకం పెట్టుకుని ఓట్ల ఆడుగుతున్నారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే పరిస్థితి తీసుకువచ్చామని.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న ఒక్క పథకం అమలుకావడం లేదని.. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news