నిరుద్యోగులకు గుడ్​ న్యూస్..​ 38800 టీచర్ జాబ్స్ భర్తీ

-

నిరుద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రాబోయే మూడేళ్లలో 38,800 టీచర్​, ఇతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 740 పాఠశాలతో 3.5 లక్షల గిరిజన విద్యార్థులకు వీరి ద్వారా సేవలు అందిచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ తన బడ్జెట్​ ప్రసంగంలో వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న 157 మెడికల్ కాలేజీలతో కలిపి మరో 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. పిల్లలు, యుక్త వయస్సుల వారి కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్​ పేర్కొన్నారు. భౌగోళిక అంశాలు, భాషలు, కళలకు సంబంధించి నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version