శ్రీ అభయాంజ‌నేయ ఘాట్ ప్రారంభం

-

బ‌ల‌గ : శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి,బలగలో రెడ్డి చిరంజీవులు సొంత నిధులతో నాగావ‌ళి న‌దీ తీరాన ఏర్పాటు చేసిన శ్రీ అభ‌య ఆంజ‌నేయ ఘాట్ ను మంగళవారం శ్రీకాకుళం శాసన సభ్యులు ధ‌ర్మాన‌ ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నది స్నానానికి వెళ్లే ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా ఘాట్ ను నిర్మించినందుకు రెడ్డి చిరంజీవుల‌ను అభినందించారు.ఇందుకు పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రినీ కలుపుకుని వెళ్లడం శుభసూచకం అని కితాబిచ్చారు.ఘాట్ ల ఏర్పాటు కోసం గతంలో గణపతి పట్నాయక్,గ్రామస్తులు స్థలాలు ఇచ్చారని,వారిని కూడా అభినందిస్తున్నాన‌న్నారు.

 

కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు,కళింగ వైశ్య కార్పొరేషన్ల చైర్మన్లు మామిడి శ్రీకాంత్,అంధవరపు సూరిబాబు,వైస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు సాధు వైకుంఠంరావు,రెడ్డి చిరంజీవులు,బలగ గణపతి పట్నాయక్,డాక్టర్ పైడి మహేశ్వరరావు,వివిఎన్ఎస్.ప్రకాష్, టంకాల బాలకృష్ణ,ఎండ రమేష్,కింజరాపు రమేష్,రవి,బలగ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version