దమ్ముంటే కొడంగల్ లో పోటీ చేసి.. గెలువు : రేవంత్ కు పట్నం నరేందర్ సవాల్

-

నిన్న కొల్లాపూర్ లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కొడంగల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు బయపెడుతామని.. డబ్బులు సంపాదించడానికి మాత్రమే రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవి కొనుక్కున్నాడని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి కి దమ్ము ఉంటే కొడంగల్ లో నాపై పోటీ చేసి గెలువు అంటూ సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ అమ్ముకొనే వ్యక్తి రేవంత్ రెడ్డి అని..హుజురాబాద్ లో 3వేల ఓట్లు వచ్చిన పార్టీ నీది అంటూ అగ్రహించారు. నీ వల్ల మహబూబ్ నగర్ కు పైసా లాభం జరిగిందా? నీ వైఖరి మార్చుకో అని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.. నీకు ఓటేసిన మల్కాజిగిరి లో ఏం చేశావ్.. చిప్ప కూడు తిన్న వ్యక్తివి నువ్వు అంటూ ఫైర్ అయ్యారు.

ఎస్సి, ఎస్టీ మైనారిటీ లను కించపరిచే వ్యక్తి రేవంత్ రెడ్డి అని.. రాబోయే రోజుల్లో ఇలాంటి వాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.పనికి రాని వెధవ రేవంత్ రెడ్డి.. వచ్చిన 10,15వేల మందితో సభలో మాట్లాడుతున్నాడు..ఆ సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news