నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయింది : జనసైనికులు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని విమర్శలు గుప్పించారు. తాజాగా.. పవన్‌ తన ట్విటర్ ఖాతా లో మద్యపాన నిషేధంపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కర్టూన్ రూపంలో ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. గతవారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్యం నిషేధంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా రాజకీయంగా కొనసాగుతూనే ఉంది. వైసీపీ మేనిఫెస్టో లో మద్య నిషేధం అనే పదమే లేదని, దశలవారీగాగా మద్యం నిషేధం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం అని ఎక్కడా చెప్పలేదని, మందుబాబులకు షాక్ కొట్టేలా చేస్తామని మాత్రమే చెప్పామన్నారు.

All about Pawan Kalyan's new Farmhouse

మీలో ఎవరికైనా డౌట్ ఉంటే రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంకు వెళ్లినా తమ మేనిఫెస్టో ఉంటుందని, చూసుకోవచ్చని అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పవన్ కల్యాణ్ ట్విటర్ లో విమర్శలు చేశారు. ఇప్పుడు మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా జనసేన నేతలు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో జగన్ చెప్పిన ఆడియో క్లిప్ లను జత చేసి.. నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news