పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన మహేశ్‌బాబు..

-

మహేశ్‌బాబు నిర్మాణ సారథ్యంలో అడివి శేష్ హీరోగా నటించిన సినిమా ‘మేజర్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అయితే తాజాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేజర్‌ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరో అడివి శేష్ స్పందించారు. “థాంక్యూ పవన్ కల్యాణ్” అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

Mahesh Babu on Adivi Sesh movie Major: 'After the film got over, I didn't  speak for two minutes…' | Entertainment News,The Indian Express

“మీ స్పందనతో మేజర్ టీమ్ నిజంగా ఆనందంతో పొంగిపోతోంది” అని పేర్కొన్నారు. అడివి శేష్ కూడా ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. “డియర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్… నా హృదయం ఆనందంతో నిండిపోయింది. టూర్ బిజీగా ఉండేసరికి మీకు మేజర్ సినిమా చూసే టైమ్ ఉంటుందా అని అనుకున్నా. కానీ మీరు వ్యక్తిగతంగా ఎంతో హృదయపూర్వకంగా రాసిన లేఖ నిజంగా మనసును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ను నా సర్వస్వంగా భావిస్తాను. ఆ రోజు పంజా, ఇవాళ మేజర్. మీ అభిమానానికి ధన్యుడ్ని” అంటూ అడివి శేష్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news