ఆర్టీసీ ప్రయాణికులకు షాక్..మాస్క్‌ లేకుంటే జరిమానాలు

-

ప్రయాణికులకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో…బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కులు ధరించేలా కఠిన నిబంధనలు అమలు చేస్తుంది ఏపీ ఆర్టీసీ. మాస్క్‌ లేకుండా బస్సు ఎక్కిన ప్రయాణికులకు రూ.50 ఫైన్స్‌ వేస్తుంది ఏపీ ఆర్టీసీ.

నిన్నటి నుంచి ఏపీ ఆర్టీసీ ఈ కొత్త రూల్‌ ను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి మాస్క్‌ ధరించనందుకు రూ.50 ఫైన్‌ వేసింది ఏపీ ఆర్టీసీ. దానికి సంబంధించిన ఓ టికెట్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ విషయం తెలయడంతో ఏపీ వాసులు అలర్ట్‌ అవుతున్నారు. ఇక ఇలాంటి రూల్‌ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కూడా పెట్టాలని కొంత మంది ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కు రిక్వెస్ట్‌ చేస్తున్నారు.ఇక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఆర్టీసీ బస్సుల్లో మాస్కులు తప్పనిసరి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news