వాహనదారులకు బిగ్‌ షాక్‌.. రూ.8 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌ !

-

సాధారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ముడి చమురు ధరలు పెరిగితే.. ఇండియాలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచుతాయి. అలాంటిది నవంబర్‌ 4 వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు మాటే లేదు. ఈ కాలంలో… బ్యారెల్‌ ముడి చమురు ధర 14 డాలర్లు పెరిగి 94 డాలర్లకు చేరింది.

త్వరలోనే.. వంద డాలర్లకు చేరుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌ కు ఒక డాలర్‌ పెరిగితే.. ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు లీటర్‌ కు 45 పైసలు పెరగాలి.

నవంబర్‌ 4 నుంచి పెరిగిన బ్యారెల్ ధరలను లెక్కవేస్తే.. ఇండియాలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 6 రూపాయలకు పైగా పెరగాలి. దీనికి వ్యాట్‌ లాంటి పన్నులను కలిపితే.. అది 8 రూపాయకు చేరుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆ నష్టాన్ని భరిస్తూ.. వచ్చిన కేంద్రం.. అవి ముగిసిన వెంటనే ఆ 8 రూపాయల భారం సామాన్యుడిపై వేసేందుకు సిద్దం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news