అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి ప్రధాని మోడీ

-

రేపు ముంబైలో రిలయన్స అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు.ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి కావడంతో దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా విచ్చేయనున్నారు. ఇందుకోసం ముంబైలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇక అతిథులను పెళ్లి మండపం దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేశారు.

ఇక అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి ప్రధాని మోడీ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. కుమారుడి పెళ్లికి రావాలని ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలను, దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల్ని ముకేశ్ అంబానీ ఆహ్వానించారు. దీంతో ఈ వివాహానికి హాజరయ్యేందుకు రాజకీయ ప్రముఖలంతా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ముంబై రాబోతున్నట్లు సమాచారం. మోడీతో పాటు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, శివరాజ్ సింగ్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version