ప్రపంచం సంక్షోభంలో ఉంది.. ఎంతకాలమో చెప్పలేం : మోదీ

-

ప్రపంచమంతా సంక్షోభంలో ఉందని..ఈ అస్థిరత ఎంత కాలం ఉంటుందో చెప్పలేమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంఘర్షణ, యుద్ధం, ఉగ్రవాదం వంటి ప్రపంచ సవాళ్లను ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్‌ సౌత్‌ వర్చువల్‌ సమ్మిట్‌లో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. అంతర్జాతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు సమస్యలను లేవనెత్తారు.

“యుద్ధం, సంఘర్షణ, తీవ్రవాదం, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు కలగలిసిన మరో కొత్త ఏడాది పేజీలోకి అడుగుపెట్టాము. చాలా వరకు గ్లోబల్ సవాళ్లను ప్రపంచ దక్షిణాది దేశాలు సృష్టించ లేదు. కానీ, అవి మనల్ని (గ్లోబల్ సౌత్) ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ మానవాళిలో మూడోవంతు మంది ప్రపంచ దక్షిణాది దేశాల్లో నివసిస్తున్నారు. భారత్‌ ఎల్లప్పుడూ తన అభివృద్ధి అనుభవాన్ని గ్లోబల్‌ సౌత్‌తో పంచుకుంటుంది. మా అభివృద్ధి భాగస్వామ్యాలు అన్ని భౌగోళిక ప్రాంతాలు, విభిన్న రంగాలకు విస్తరించాయి. మహమ్మారి సమయంలో మేము‍(భారత్‌) 100 దేశాలకు మందులు, వ్యాక్సిన్‌లను సరఫరా చేశాం. అభివృద్ధి చెందుతున్న దేశాల ఉమ్మడి భవిష్యత్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించేందుకు భారత్‌ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది” అని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version