Breaking : సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై కేసు నమోదు

-

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. పోసాని కృష్ణ మురళీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కొనసాగుతున్నారు. తాజాగా పోసాని పై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అణుచిత వ్యాఖ్యలు చేశారని గతంలో జనసేన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో యందం ఇందిరా రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను పోసాని చాలా దారుణంగా దూషించారని తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Posani Krishna Murali: పోసానిపై కేసు | Case against Posani bbr

అప్పుడు దీనిపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీంతో పోసానిపై కేసు నమోదు చేయాలని రాజమహేంద్రవరం రెండో జెఎఫ్‌సీఎం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరు శనివారం పోలీసులు పోసానిపై ఐపీసీ 354, 355, 500, 506, 507, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే పోసాని కృష్ణ మురళీకి ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇంతలోనే కేసు నమోదు కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news