రేవంత్ రెడ్డికి షాక్.. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద మరో కేసు నమోదు

-

తెలంగాణ పీసీసీగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. రేవంత్ రెడ్డిపై తాజాగా రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. రేవంత్‌ ప్రమాణ స్వీకారం రోజునే ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా బుధవారం రేవంత్‌ రెడ్డి ర్యాలీ.. నిర్వహించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

రేవంత్‌ ర్యాలీ కారణంగా పలు చోట్లు కాంగ్రెస్‌ నేతలు రోడ్లను బ్లాక్‌ చేశారని.. పలు చోట్ల ర్యాలీ కారణంగా వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని జూబ్లీ హిల్స్‌ ఎస్‌ ఐ రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి చేశారు.

జూబ్లీ హిల్స్‌లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడున్న కోవిడ్‌ పరిస్థితుల్లో ఎలాంటి ఊరేగింపులు కానీ.. ర్యాలీలు కానీ.. సమావేశాలు కానీ జరగకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా… నిన్న మధ్యాహ్నం.. గాంధీ భవన్‌ లో పీసీసీ బాధ్యతలు చేపట్టారు రేవంత్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version