దివిస్‌ ఫ్యాక్టరీ చుట్టూ వేడెక్కుతున్న రాజకీయం

-

దివిస్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది… అధికారంలో ఉండగా దివిస్ కి అనుమతులు ఇచ్చిన తెలుగుదేశం, ఇప్పుడు దివిస్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది ..ప్రతిపక్షంలో ఉండగా దివిస్ కి వ్యతిరేకంగా ప్రకటన చేసిన వైసిపి ఇప్పుడు అనుమతులు ఇచ్చింది. బీజేపీ తో కలసి దివిస్ పై పోరాటంలో కి దిగాలని జనసేన భావిస్తోంది…

దివిస్‌ ఫ్యాక్టరీకి ఏపీ సర్కార్‌.. మరో 200ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ అనుమతులు ఇవ్వడం రాజకీయ దుమారం చేస్తోంది . అప్పట్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన జగన్‌.. ఇప్పుడు సీఎం అయ్యాక అదే ఫ్యాక్టరీ ఏర్పాటుకు అదనంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ, వైసీపీల మీదున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది జనసేన. బీజేపీతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని స్కెచ్‌ వేస్తోంది.

మరోవైపు దివిస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు,, మత్స్యకారులు, గ్రామస్తులు సృష్టించిన విధ్వంసంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 166 మంది గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. దీంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి వామపక్షాలు.

టీడీపీ అధినేతకు దివి మురళికి మంచి అనుబంధం ఉన్నా టీడీపీ సైతం దివిస్ పై పోరాటానికి సై అంటుంది.రాజకీయ పార్టీలు ఈ ఉద్యమాన్ని.. తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలతో పాటు స్థానిక ప్రజా సంఘాలు పైచేయి సాధించాలని చూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news