వైసీపీకి బాలయ్య-పవన్ వార్నింగ్..ఇదెక్కడి కాన్సెప్ట్..!

-

అధికార వైసీపీపై అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతుంది. పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెడతారని తెలుస్తోంది. ఇదే సమయంలో సినీ రంగంలో అగ్రనటులుగా ఉన్న బాలయ్య, పవన్‌లు సైతం..కలిసి అన్‌స్టాపబుల్ షో చేసిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య టి‌డి‌పి ఎమ్మెల్యే…పవన్ జనసేన అధినేత. ఇక ఇద్దరు నేతలు ఊహించని విధంగా వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా మంగళగిరిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో వైసీపీపై పవన్ విరుచుకుపడ్డారు. వేర్పాటు వాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరని, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేసిన మంత్రి ధర్మాన.. రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిలపై ఫైర్ అయ్యారు.

Unstoppable 2: పవన్.. బాలయ్య “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ హింట్ ఇచ్చిన ఆహా..? | NewsOrbit

వారాహి ఎలా రోడ్ల మీదకు వస్తుందో చూస్తామంటున్నారని..తాను చట్టాలను గౌరవించేవాడినని, కోడి కత్తితో పోడిపించుకుని డ్రామాలాడేవాడిని కానని వైసీపీ పై మండిపడ్డారు. ఏపీని పాలిస్తున్న వైసీపీ నేతలకు సిగ్గుందా..? రూ. 5 వేలు ఇస్తే సరిపోతుందా..? వాలంటీర్ ఉద్యోగం సరిపోతుందా..? అని ఆగ్రహించారు.

అదే సమయంలో ఉద్యోగాలపై బాలయ్య కూడా స్పందించారు. హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని.. కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ రావట్లేదని బాలయ్య ఫైర్ అయ్యారు. అలాగే వరైనా నాకు 60 సంవత్సరాలు..ముసలోడు అయ్యాడంటూ వ్యాఖ్యలు చేస్తే..వాడికి దబిడి దిబిడే అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. మొత్తానికి పవన్-బాలయ్య వేరు వేరు వేదికల ద్వారా వైసీపీపై విరుచుకుపడుతూ..ఉద్యోగాల విషయంలో రెస్పాన్స్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news