బండి సంజయ్: కేసీఆర్ ఏమి ప్రభుత్వమయ్యా… “పేపర్ ల లీకేజీల జాతర”

-

ఈ రోజు జరిగిన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మన రాష్ట్రంలోనే ఎందుకు వరుసగా పేపర్ లీక్ లు జరుగుతున్నాయి.. నిజంగా ఇది చాలా దురదృష్టకరం అంటూ వేదనకు లోనయ్యాడు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి.. ఈయన ప్రభుత్వంలో పరీక్షల పేపర్ లు లీక్ అవ్వడం చాలా సాధారణం అయిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తెలంగాణాలో లీకేజీల జాతర నడుస్తోంది అంటూ హాస్యాస్పదంగా మాట్లాడారు.

సీఎం కేసీఆర్ మేము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పుడు కాదు. రాష్ట్రంలో ముందు పరీక్షలు చక్కగా జరిపించు అంటూ సెటైరికల్ కామెంట్ చేశాడు. పరీక్షలు నిర్వహించడం చేతకాకపోతే ఎందుకు అధికారం అంటూ దుయ్యబట్టారు. ఫైనల్ గా ఈ ఘటనలో బాధ్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాలని గట్టిగా అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news