ఎమ్మెల్యే ఎంపీ గొడవ… తాడేపల్లి పిలిచిన జగన్

-

వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. వైసీపీ బలంగా ఉన్నా సరే వర్గ విభేదాలతో పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. డీఆర్సీ సమావేశంలో ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. ద్వారంపూడి… పిల్లిపై ఆరోపణలు చేసారు.

ఈ సమావేశంలో వీళ్ళు ఇలా తిట్టుకోవడంపై సిఎం జగన్ ఆరా తీసారు. ఇద్దరు నేతలు తనను కలవాలి అని జగన్ ఆదేశించారు. ఇద్దరు నేతలు గొడవపై వివరణ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. దీనితో కాసేపటి క్రితం ఇద్దరు నేతలు సిఎం జగన్ వద్దకు చేరుకున్నారు. ఈ వ్యవహారం మీడియా వర్గాల్లో సంచలనం అయింది. ఇద్దరిపై నేరుగానే సిఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news