‘కమ్మ’ని ‘కాపు’ కాస్తున్న కల్యాణ్ ‘బాబు’…

-

పవన్ కల్యాణ్ దూకుడు ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు…ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీపై దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తూనే…వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కూడా రాజమండ్రిలో పవన్ కల్యాణ్…శ్రమదానం కార్యక్రమాన్ని తలపెట్టారు. రోడ్లపై పడిన గుంతలని పూడ్చే కార్యక్రమం చేశారు. ఇక అక్కడే సభ పెట్టుకుని యథావిధిగా…జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో ఉన్న సమస్యలని హైలైట్ చేస్తూనే, తనపై విమర్శలు చేసినవారికి వరుసపెట్టి కౌంటర్లు ఇచ్చారు…అలాగే ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శించారు. ఇదే క్రమంలో మరోసారి పవన్ కల్యాణ్….కమ్మ వర్గం ప్రస్తావన తీసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కమ్మ వర్గాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తుందనే అంశాన్ని మరొకసారి హైలైట్ చేశారు. కమ్మ వర్గాన్ని ఒక వర్గ శత్రువుగా చూడటం కరెక్ట్ కాదని పవన్ మాట్లాడారు. కమ్మ వర్గంపై ద్వేషంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఇక ప్రశ్నించే వారిపై వైసీపీ ఎదురుదాడి చేస్తుందని… తనతో పాటు ఒక మాజీ సి‌ఎం, ఉపరాష్ట్రపతి…ఆఖరికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ని కూడా టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారని అన్నారు. అంటే పవన్…పరోక్షంగా చంద్రబాబుకు ఏ విధంగా మద్ధతుగా మాట్లాడుతున్నారో క్లియర్‌గా అర్ధమవుతుంది. పైగా గత రెండేళ్ల నుంచి జగన్ ప్రభుత్వం…కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసి రాజకీయం చేస్తుందని టి‌డి‌పి నేతలు ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉన్నారు.

కానీ ఆ విషయం టి‌డి‌పి నేతలు చెబితే పెద్దగా హైలైట్ కావడం లేదు. అదే పవన్…కమ్మ వర్గం గురించి మాట్లాడితే…అది బాగా హైలైట్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం నిజంగానే…కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసిందనే డౌట్ జనాల్లో వస్తుంది. అలాగే వైసీపీపై వ్యతిరేక భావన పెరుగుతుంది. ఆ కోణంతోనే కల్యాణ్ బాబు…కమ్మని కాపు కాస్తున్నట్లు కనబడుతోంది. అయితే గతంలో టి‌డి‌పి ప్రభుత్వం ఉండగా…రెడ్డి వర్గాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా అంతా చూశారు. అప్పుడే పవన్…ఈ తరహాగా మాట్లాడి ఉంటే బాగుండేది.

Read more RELATED
Recommended to you

Latest news